ప్రస్తుతం సినీ పరిశ్రమలో కీర్తి సురేష్ పేరు మారుమోగిపోతుంది….తెలుగులో తన అరంగేట్రం సినిమా `నేను శైలజ`తో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ .. `మహానటి`తో మరింత ఆదరణ సంపాదించుకుంది. తెలుగువారు ఎంతో అభిమానించే సావిత్రి పాత్రలో కీర్తి అద్భుత నటన ప్రదర్శించిన సంగతి అందరికి తెలిసిందే. సినీ ప్రముఖులు కూడా కీర్తి ఆ పాత్రలో పూర్తిగా విలీనమై నటించిందని ప్రసంసలజల్లు కురుపించారు. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తికి మరో అరుదైన అవకాశం వచ్చినట్టు వార్తలు వచ్చాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా ఓ సినిమా రాబోతుంది.ఇందులో నటించమని కీర్తికి ఆఫర్ వచ్చిందని సమాచారం .అయితే దీనిపై తాజాగా కీర్తి స్పందించింది. `నాకు ఎలాంటి ఆఫర్ రాలేదని, వచ్చినా నేను తగను అని, ఎందుకంటే జయలలిత పాత్రలో కనిపించే ధైర్యం నాకు లేదు` అని కీర్తి తెలియపర్చారు