Home / POLITICS / మ‌ళ్లీ న‌వ్వుల‌పాలైన కాంగ్రెస్‌ నేతలు

మ‌ళ్లీ న‌వ్వుల‌పాలైన కాంగ్రెస్‌ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఊహించ‌ని కామెడీలు చేస్తోంది. జ‌న‌బాహూల్యానికి సుప‌రిచిత‌మైన అంశాల‌ను మ‌భ్య‌పెట్టాల‌నే ప్ర‌య‌త్నం చేసి న‌వ్వుల పాలు అయింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ విషయం రాష్ట్రంలోని వారంద‌రికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ.. ఢిల్లీ నాయకులకు కానీ పట్టినట్టులేదు! ఎందుకంటే…ఆయ‌న‌కు త‌మ క‌మిటీలో చోటు క‌ల్పించి కామెడీ చేశారు.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లట్ ఆధ్వర్యంలో కొంత మంది నేతలను ఎన్నికల బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపిక చేశారు. ప్ర‌దేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో సభ్యునిగా సురేష్ రెడ్డి పేరును కూడా చేర్చి జాబితాను విడుదల చేశారు. త‌ద్వారా ఊహించ‌ని కామెడీకి కాంగ్రెస్ పార్టీ తెర‌లేపింది. మా పార్టీని చీకొట్టినా పర్లేదు… క‌మిటీల్లో చోటు క‌ల్పిస్తామంటూ కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తన పరువును తనే తీసుకుందనేది స్ప‌ష్ట‌మైంద‌ని చెప్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat