తెలంగాణ రాష్ట్రమంతటా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మజ్లీస్ పార్టీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడున్న తరుణంలో మజ్లీస్ తీసుకున్న ఈ నిర్ణయంతో యావత్తు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో రేపు వెలువడునున్న ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో సర్కారును ఏర్పాటుచేయబోతుంది.
మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు.టీఆర్ఎస్ పార్టీకి మజ్లీస్ అండగా ఉంటుందని ట్విట్టర్ సాక్షిగా ఆయన స్పష్టం చేశారు. జాతినిర్మాణం లక్ష్యం దిశగా ఇది మా తొలి అడుగు అని ఓవైసీ ట్వీట్ చేశారు..