2014లో అధికారం చేపట్టి నాలుగేళ్లవుతున్నా.. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ మంచి చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రకారం ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. తెలుగుదేశం పాలనలో విసుగు చెందిన ప్రజలు వచ్చేఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఇంతకాలం పబ్లిసిటీతో మోసం చేస్తున్న చంద్యబాబును ప్రజలెవ్వరూ నమ్మడం లేదు. బాబూ.. నీకో దండం ఇక తప్పుకో అంటున్నారు. వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిన్ను నమ్మం బాబు కార్యక్రమానికి పార్టీ ఊహించినదానికంటే రెట్టింపు స్పందన స్పందన లభిస్తోంది. చంద్రబాబును ప్రజలు నమ్మకపోవడానికి కారణాలివే..
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరకడం.. రాజధాని పేరు తో భూమి కుంభకోణానికి పాల్పడడం, ఎక్కడికక్కడ కోరలు చాచిన ఇసుక మాఫియా, ఎర్రచందనం మాఫియా ను ప్రోత్సహించడం. పవర్ ప్రాజెక్టుల్లో భారీగా లంచాలు మింగడం, టీడీపీ నేతల కాల్ మని మాఫియా, లిక్కర్ మాఫియా, రాజధాని లో పంటలు తగలబెట్టి వైసీపీ నెట్టడం, కాలేజీలలో కుల ర్యాగింగ్ మరణాలు సంభవించినా నిందితులకు కొమ్ము కాయడం, ప్రభుత్వ అధికారులమీద బౌతిక దాడులు, పుష్కర ప్రచార పిచ్చితో 30 మంది మరణాలకు కారకులవ్వడం, కాపులతో కుల రాజకీయ క్రీడ, ఇచ్చిన 600 అబద్ధపు హామీల్లో ఒక్క హామీనైనా నిలబెట్టుకోని వైనం, విద్య, వైద్యం, నిర్వీర్యం, అవినీతిలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ని నిలపడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు, ఇన్ని తప్పులు చేసినందుకు నిన్ను నమ్మం బాబు అంటూ రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు.