యాత్ర సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. నేను రాజన్న అభిమాని నుండి జగనన్న అభిమాని ఎందుకు అయ్యానో చెప్పాలి, అందరికీ తెలియజేయాలన్నారు. నేను ఈ సినిమా కథ రాశాను కాని.. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు ఆ కథకు ప్రాణం పోశారన్నారు. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది బుక్లోనే ఉంటుంది. అది స్క్రీన్ మీదికి రావాలి అంటే సరైన ప్రొడ్యుసర్ దొరకాలి. అలాంటి నిర్మాత ఈ సినిమాకి పనిచేశారన్నారు.
ఇక్కడ జై జగన్ అని అరిస్తే ఇడుపులపాయకి వినిపించాలి. అమరావతి వరకూ వినిపించాలని చంద్రబాబునుద్దేశించి అన్నారు. ఈ పాటికి అమరావతికి వినపడే ఉంటాది.. నిద్ర కూడా లేచి ఉంటారు అక్కడున్న వాళ్ళు అంటూ మాట్లాడారు దర్శకుడు.. ఇలా ఎమోషనల్ స్పీచ్తో అదరగొట్టారు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ మూవీ ఈవెంట్లో వైఎస్ అభిమానుల్ని ఉత్సాహపరిచే ప్రసంగం చేశారాయన. ఈ చిత్రంలో వైఎస్ పాత్రధారిగా చేసిన మమ్ముట్టి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆద్యంతం వైఎస్ అభిమానులను అలరించే విధంగా ఈ కార్యక్రమం సాగింది.