మన దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ను చూస్తే ఎవరికైనా అది టీడీపీ భవనా అని అనుమానం వస్తుంది.ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేల ధర్మపోరాట దీక్షల పేరుతో కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు మన సీఎం.నేడు ఇక్కడ దీక్ష చేయనున్నాడు. ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లు.. అత్యుత్సాహంతో ఏపీ భవన్ను మొత్తాన్ని టీడీపీ భవన్ గా మార్చేసారు. భవన్ అంతా పసుపు మయం చేసేసారు.అంతే కాక పసుపు టీషర్ట్ల పై చంద్రబాబు ఆర్మీ అంటూ ప్రింట్ చేయించి ఏపీ భవన్ ప్రాంగణంలో హల్చల్ చేస్తున్నారు.
దీనివల్ల ఏపీ, తెలంగాణ ఉమ్మడి భవన్ సందర్శకులు వీరి చేష్టలకు చాలా ఇబ్బంది పడుతున్నారు.ఇప్పటికే పార్టీ ప్రచారానికి సొంత డబ్బు కాకుండా ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తు ఇదేదో తెలుగుదేశం సొత్తయినట్లు వ్యవహరిస్తున్నారు.అక్కడ యంత్రాంగం మాత్రం ఎవరిని పట్టించుకోకుండా టీడీపీ మత్తులో పడిపోయింది.