మరో రెండు మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే ఏపీలో రాజకీయ వాతావరణం ఏర్పడింది.ఇప్పటినుంచే నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నేతలు ప్రచారం మొదలు పెట్టారు.ఇక ఇదిలా ఉండగా మొన్నటిదాకా వేయి రూపాయల పించన్లు మాత్రమే చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వేల రెండు వేల రూపాయలను చేసింది. అయితే ఈ హామీని జగన్ నవరత్నాలలో భాగంగా ఒక సంవత్సరం ముందుగానే ప్రకటించాడు.తాజాగా వైసీపీ అధికారంలోకి రాగానే మూడు వేలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు.అయితే ప్రజల్లో మాత్రం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లనే ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పించన్లు ఇస్తుందని ఫిక్స్ అయిపోయారు. జగన్ ఆ రోజు అవ్వా,తాతలకు రెండు వేల పించన్లు ఇస్తామని అనకపోతే ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పించన్లు అనే వాడు కాదు,ఇచ్చేవాడు కాదని కొంతమంది వృద్దులు అంటున్నారు.అందుకు సాక్ష్యమే ఈ వీడియో..
రెండు వేలు కాదు పదివేలు ఇచ్చినా జగన్ కే ఓటు వేస్తాం . ఇవన్నీ జగన్ ఉన్నాడనే కదా ఇస్తుంది . అందుకే ఫ్యాన్ కే మా ఓటు అంటూ ఒక ముసలవ్వ అంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.