వైఎస్సార్ కాంగ్రెస్ , ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం ఢిల్లీ వెళుతున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ‘ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారో దక్షిణాది ఎలా నిర్ణయిస్తుంది?’ (‘హౌ ది డెక్కన్ విల్ డిసైడ్ హూ సిట్స్ ఇన్ ఢిల్లీ) అనే అంశంపై ‘ఇండియా టుడే’ శుక్ర, శనివారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ శనివారం ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.