Home / 18+ / చంద్రబాబు దర్మార్గ పాలనపై ప్రతీ ఇంట్లో చర్చ జరపండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు

చంద్రబాబు దర్మార్గ పాలనపై ప్రతీ ఇంట్లో చర్చ జరపండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్‌ గాలికి తెలుగుదేశం పార్టీకి బీటలు ప‌డాల‌ని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు దుర్మార్గ‌పు పాల‌న‌పై ప్ర‌తీఇంట్లో చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. రేపు అన్న ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని అందరికీ చెప్పాల‌ని సూచించారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని, ఓటు కోసం చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పాలన్నారు. ఈ రోజు మన పిల్లలు ఇంజినీరింగ్, డాక్టర్‌ చదువులు చదవలేరు.

చదువులకోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నామని, అన్న ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు రూ. 3 వేలకు మోసపోవద్దు. పిల్లలను ఇంజినీరింగ్‌ చదవాలన్నా, డాక్టర్‌లుగా చేయాలన్నా కలెక్టర్‌ వంటి చదువులకు ఎన్ని లక్షలు అయినా సరే అన్న చదివిస్తాడని ప్రతి గ్రామంలో చెప్పాలన్నారు. ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి చెప్పాలి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అన్న ముఖ్యమంత్రి అయితే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. మీ కష్టాలు, మీ బాధలు అన్నకు తెలుసు. చంద్రబాబులా అన్న మోసం చేయడు.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు.

వైయస్‌ఆర్‌ చేయూత అనే కార్యక్రమం ద్వారా ప్రతీఅక్క చేతుల్లో రూ. 75 వేలు నాలుగు దఫాల్లో అందిస్తాడని, చంద్రబాబు ఇస్తున్న రూ. 3 వేలతో మోసపోవద్దన్నారు. అన్న ముఖ్యమంత్రి కావాలి. అన్న ముఖ్యమంత్రి అయితే పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఎన్నికల సమయానికి ఉన్న మొత్తం అప్పును నాలుగు దఫాలుగా మీ చేతికే ఇస్తాడని చెప్పండి అంతే తప్ప చంద్రబాబు ఇచ్చే డబ్బు తీసుకుని మోసపోవద్దని చెప్పండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat