నరసరావుపేట ఎంపీ సీటు తనకు లేదా తన కుమారుడికి ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు టీడీపీ అధినేత చంద్రబాబుని డిమాండ్ చేసారు.అలా ఇవ్వన్ని పక్షంలో పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన ముడుపుల గుట్టు ప్రజల ముందు పెడతానని చెప్పినట్లు సమాచారం.అయితే పోలవరం కు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చిన తన పని అయిపోతుందని భావించిన చంద్రబాబు..రాయపాటి బెదిరింపులకు వెనక్కి తగ్గి నరసరావుపేట లోక్సభ స్థానం పై అతడికి స్పష్టత ఇచ్చారని చెబుతున్నారు.నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..నరసరావుపేట సీటు తనకే ఇస్తానని బాబు చెప్పారని అన్నారు.
అప్పట్లో పోలవరం పనులకు సంబంధించి రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ రూ.4,054 కోట్లకు మార్చి 3, 2013న దక్కించుకుంది.అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రాజెక్టుల పనుల్లో ఏ మాత్రం అవగాహన లేని ట్రాన్స్ట్రాయ్కు ఇది ఎలా అప్పగిస్తారని విమర్శించారు.2014 ఎన్నికలకు ముందు రాయపాటి టీడీపీలోకి వచ్చేసారు.ఆ తరువాత రాయపాటి సంస్థ హెడ్వర్క్స్లో ఏమాత్రం కదలిక లేదని,వీళ్లు ఈ పనికి సరిపోరని ఎన్నోసార్లు ప్రభుత్వానికి చెప్పిన ఎలాంటి చర్య తీసుకోపోగా ప్రాజెక్టు బాధ్యతలు సర్కార్కు దక్కగానే అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెంచేసింది.