Home / ANDHRAPRADESH / ఏపీలో మళ్లీ ఎన్నికలు..?

ఏపీలో మళ్లీ ఎన్నికలు..?

అదేంటీ ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇంకా  విడుదల కాలేదు. మళ్లీ ఎన్నికలేంటీ అని ఆలోచిస్తోన్నారా.. లేకపోతే ఫేక్ వార్త అని నవ్వి ఊరుకుంటున్నారా..?. ఇది అక్షరాల నిజమైన వార్త. ఈ నెల పదకొండు తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం. మరికొన్ని చోట్ల గొడవ సంఘటనలు జరగడంతో ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్త 5 పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. రాష్ట్రంలోని గుంటూరులో జిల్లాలో 2 చోట్ల, నెల్లూరు జిల్లాలో 2 చోట్ల , ప్రకాశంలో 1 చోట పోలింగ్ కేంద్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరింది.

రాష్ట్ర ఎన్నికల అభ్యర్థనను అంగీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం… రీ-పోలింగ్ ఎప్పుడు నిర్వహించేదీ ప్రకటిస్తామని తెలిపింది. అయితే ఈ ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన స్క్రూటినీ రిపోర్టులను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat