అదేంటీ ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇంకా విడుదల కాలేదు. మళ్లీ ఎన్నికలేంటీ అని ఆలోచిస్తోన్నారా.. లేకపోతే ఫేక్ వార్త అని నవ్వి ఊరుకుంటున్నారా..?. ఇది అక్షరాల నిజమైన వార్త. ఈ నెల పదకొండు తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం. మరికొన్ని చోట్ల గొడవ సంఘటనలు జరగడంతో ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్త 5 పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది. రాష్ట్రంలోని గుంటూరులో జిల్లాలో 2 చోట్ల, నెల్లూరు జిల్లాలో 2 చోట్ల , ప్రకాశంలో 1 చోట పోలింగ్ కేంద్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరింది.
రాష్ట్ర ఎన్నికల అభ్యర్థనను అంగీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం… రీ-పోలింగ్ ఎప్పుడు నిర్వహించేదీ ప్రకటిస్తామని తెలిపింది. అయితే ఈ ఐదు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన స్క్రూటినీ రిపోర్టులను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించింది.