అదేంటీ ఏపీలో ఈ నెల పదకొండున జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే నెల మే 23న కదా విడుదల. అప్పుడే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మే24న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారని అనుమానపడుతున్నారా.. లేకపోతే ఇది ఒక ఫేక్ వార్త అని అనుకుంటున్నారా.. అయితే,అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం వచ్చే నెలలో వెలువడునున్న ఎన్నికల ఫలితాలపై గెలుపు తమదేనంటూ ఇటు అధికార టీడీపీ, అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తోన్నారు.
ఈ క్రమంలో ఏపీ సీఎస్ సుబ్రమణ్యం “తమకు జూన్ నెల 7వరకు పరిపాలించే అవకాశముందని వ్యాఖ్యలు చేస్తోన్న ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ”ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 23న వెలువడునున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరుసటి రోజు అంటే మే నెల 24న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఒకవేళ టీడీపీ గెలిస్తే ఆ పార్టీ అధినేత ,అపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడంటే అప్పుడు ప్రమాణ స్వీకారం చేయచ్చునని” ఆయన తెలిపారు.ఆయన ఇంకా మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయాక కూడా ఫలానా తేది వరకు అధికారంలో ఉంటామనే వ్యాఖ్యలు సరికాదు అని ఆయన అన్నారు..