Home / SLIDER / తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సంబంధిత మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెల్సిందే.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెయిలైన విద్యార్థుల నుండి రీవెరుఫికేషన్,రీకౌంటింగ్ లకు ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని సూచించారు. అంతే కాకుండా పాసైన విద్యార్థుల నుండి మాత్రం గతంలో మాదిరిగా ఉన్న పద్దతుల్లోనే రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరారు.

అందులో భాగంగా ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులు రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ కు ఎటువంటి దరఖాస్తు చేయనక్కర్లేదని తేల్చి చెప్పింది. అయితే ఫెయిలైన విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ ఉంటుందని తెలిపింది. ఇప్పటికే రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లిస్తామని బోర్డు ప్రకటించింది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat