తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించాలనే లక్ష్యంతో పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు తెరదీసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూడా నిర్మించాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు సంకల్పించింది. అయితే,ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన కొంతమంది నిర్వాసితులు కానున్న నేపథ్యంలో వీరికి దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ సర్కారు ప్యాకేజీ ను అందిస్తుంది.
నిన్న శుక్రవారం ఉన్నత స్థాయి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్.ఈ సమావేశంలో మల్లన్నసాగర్ యుద్ధప్రాతిపదికన పూర్తి అవ్వాలి. నిర్వాసితులకు మే పదకోండు తారీఖు లోపు పరిహారం ,పునరావాస పత్రాలు అందాలని “సూచించారు.తక్షణ సాయం కోసం వెంటనే రూ.650కోట్లు విడుదల చేస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు తెలిపారు.పునరావాసం పూర్తిచేసి మే 15న తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు నివేదిక అందించాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు తెలిపారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద రాంపూర్,సింగారం గ్రామాలకు చెందిన 460మందికి చెక్కుల పంపిణీ చేసినట్లు కూడా అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. అయితే,పునరావాసం,పరిహారం లాంటి పనులు సక్రమంగా జరగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదిమంది అధికారులకు బాధ్యతలు అప్పజెప్పారు.నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితులకు శుభవార్తను తెలిపారు.