ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగిన 2019ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబాయి ఇండియన్స్ కేవలం ఒక్క పరుగుతోనే ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే.
అయితే ముంబాయి చేతిలో చెన్నై ఓడిపోవడానికి చెన్నై జట్టు సారధి ఎంఎస్ ధోనీ చేసిన పోరపాటు కారణమని చెన్నై అభిమానులు చెబుతున్నారు. మ్యాచ్ చివర్లో రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో ధోనీ సీనియర్ ఆటగాడు హర్బ్జజన్ సింగ్ ను కాదని శార్దుల్ ఠాకుర్ను పంపడం తప్పు అని క్రికెట్ ప్రేమికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోన్నారు. అయితే ప్రముఖ క్రికెట్ విశ్లేషకులైన విజయ్ లోకపల్లి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం