తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ను ఏజెంట్ల మోసానికి బలై సర్వసం కోల్పోయిన గల్ఫ్ బాధితుడు ఒకరు నన్ను కాపాడాలని వేడుకుంటూ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇల్లంతకుంట నివాసి సమీర్ ఒక ఏజెంట్ కు రూ.ఎనబై మూడు వేలను ఇచ్చి సౌదీకి వెళ్ళాడు.
అయితే అక్కడకెళ్ళిన తర్వాత ఒక ఫాం హౌజ్లో పని అప్పగించారు. ఈ పనిలో భాగంగా యజమాని గొర్రెలను కాసేందుకు ఎడారికి పంపాడు. ఇరవై రోజులు తిండి కూడా లేదని ఆ యువకుడు ఏడుస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విన్నవిస్తూ ఒక వీడియోను పోస్టు చేశాడు. దీంతో చలించిపోయిన కేటీఆర్ అతడ్ని భారత్ కు పంపించాలని.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని రియాద్ లోని భారత ఎంబీసీని కోరారు.