టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్దె హీరోయిన్ గా ,ప్రకాష్ రాజ్,సాయికుమార్,అల్లరి నరేష్,జయసుధ,వెన్నెల కిషోర్,జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రలలో నటించగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి నేతృత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్,పీవీపీ,అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ”మహర్షి”.
మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఈ నెల తొమ్మిదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. బెనిఫిట్ షో దగ్గర నుండి ఈ మూవీ హిట్ టాక్ ను తెచ్చుకుని భారీ కలెక్షన్లతో విజయపథంలో దూసుకుపోతుంది.దీంతో ఈ మూవీ తొలివారంలోనే 59.37కోట్ల షేర్ ను వసూలు చేసింది.
ఒక్క నైజాంలోనే ఈ సినిమా 21.67కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం.మహేష్ సినిమా కెరీర్లోనే ఇంత మొత్తంలో వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి. భరత్ అనే నేను తర్వాత మంచి హిట్ తో పాటు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించే సినిమా తీయడంతో సూపర్ స్టార్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.