పంజాబీ భామ చార్మి కౌర్ కొత్తగా నిర్మాతగా అవతారం ఎత్తిన విషయం అందరికి తెలిసిందే.పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి గాను చార్మి నిర్మాత భాద్యతలు తీసుకుంది.ఇందులో హీరోగా రామ్, హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లో కూడా చురుగ్గా పాల్గుంటుంది.రీసెంట్ గా ఈమె మీడియాతో మాట్లాడుతూ..నేను ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాను,ఇంక నటనకు దూరంగా ఉంటాను కాని ఇండస్ట్రీ లోనే ఉంటానని చెప్పింది.అంతే కాకుండా మీడియాతో తన పెళ్లి వ్యవహారం గురించి కూడా మాట్లాడింది.అయితే తన పెళ్లి మరియు పిల్లల విషయానికి వస్తే ఇప్పట్లో ఎటువంటి ఆలోచన లేదని తేల్చి చెప్పేసింది.