ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైసీపీ 151 సీట్లు సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు. వైసీపీ ఏకంగా 22 ఏంపీ సీట్లు గెలవడంతో తెలుగు తమ్ముళ్లకు ఇప్పటికి ప్రశాంతంగా నిద్రపోవడం లేదంట. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. అయితే జగన్ గెలుపుపై దేశ వ్యాప్తంగా ప్రశంశలు వచ్చాయి. దేశ ప్రధాని తో పాటు , పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పెద్ద కూతురు లండన్ నుండి ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. ముందుగా కంగ్రాట్స్ చెప్పి ..మీ కష్టం ఫలిచింది నాన్న….మీమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి నా దన్యవాదములు..మీ మీద నమ్మకంతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పకుండా న్యాయం చెయ్యండి డాడీ.. గత కొన్ని ఏళ్ళుగా టీడీపీ పాలనతో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు..వాటిని మీరు పరిష్కరించాలి….తాతయ్య లాగా మీరు మంచి పాలన అందిచాలి అని అన్నారంట. ఇంకా మీరు ఇప్పడు మంచి పాలన అందిస్తే తాతయ్య లాగా మళ్లీ రెండోసారి అంటే( 2024 )లో నిన్ను ప్రజలు గెలిపిస్తారు..నువ్వు గెలుస్తావు అని నేను నమ్మతున్నా చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పిందంట.
Home / ANDHRAPRADESH / గెలుపు వార్త వినగానే జగన్ కు లండన్ నుండి కూతురు ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా..!
Tags 2019-elections andrapradesh daughter Harsha london ys jagan