ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతికొద్ది గంటల్లోనే వైసీపీ అధినేత ,నవ్యాంధ్రకు కాబోయే రెండువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల విడుదలైన
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను ,ఇరవై రెండు ఎంపీ స్థానాలను దక్కించుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిముఖ్యమంత్రిగా ప్రమాణ
స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారి భక్తులకు శుభవార్తను తెలిపారు.
ఇప్పటికే కొండపై ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి కేటాయించిన టిక్కెట్ల రేట్లు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్న సంగతి తెల్సిందే. అయితే ఈ మేరకు ఆలయ ఈఓ కోటేశ్వరమ్మ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో”బెజవాడ ఆలయ దర్శన టిక్కెట్ల ధరలను తగ్గిస్తున్నట్లు”ఆమె ప్రకటించారు. అయితే నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్ఫూర్తితో భక్తులకు ఉచిత సేవలు అందించనున్నట్లు ఆమె వివరించారు.
ఇప్పటివరకు కొండపై మొబైల్ ,స్మార్ట్ ఫోన్లు భద్రతకు రూ. 5లు వసూలు చేస్తోన్నారు. ఇక నుండి ఈ సేవను ఉచితంగా అందజేయనున్నట్లు ఆమె వివరించారు. అయితే ఇప్పటికే పాదరక్షలను భద్రపరిచే స్థలం,బ్యాగులు ఇతర వస్తువులను భద్రపరుచు సేవలు కూడా ఉచితంగా లభించనున్నాయి.దుర్గగుడిలో గర్భగుడి దర్శనానికి రూ.300లు వసూలు బదులు ఇక నుండి రెండు వందలకు అవకాశమివ్వనున్నారు. అయితే సీఎం గారి నుండి ఆదేశాలు రాగానే ఈ సేవలు
అమల్లోకి వస్తాయని ఆమె తెలిపారు.