ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున నిలబడిన అనుముల రేవంత్ రెడ్డి మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు అనుముల రేవంత్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారని ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో తనపై జరుగుతున్న ప్రచారంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. అది అంతా తనపై బురద చల్లడానికి తన ప్రత్యర్థులు చేస్తోన్న కుట్రలు”అని ఆయన తిప్పికొట్టారు. ఇంకా ఆయన మాట్లాడుతూ”అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్,అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు వలనే ఓడిపోయానని “ఆయన చెప్పుకొచ్చారు.
గత రెండేళ్ళ కింద టీడీపీలో ఉన్న రేవంత్ ఆ తర్వాత కొన్ని పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెల్సిందే. తెలంగాణ ఏపీలతో పాటు జాతీయ రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ప్రధాని ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ కేసు నుండి తప్పించుకోవడానికే ఆయన పార్టీ మారడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు..