Home / 18+ / ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే అలా చేసేవారు.. ఇప్పుడు మహేశ్ చేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే అలా చేసేవారు.. ఇప్పుడు మహేశ్ చేస్తున్నారు

వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరక్టర్ అనిల్ రావిపూడి మహేష్ నటించనున్న 26వ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రం ఇవాళ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో జోడీగా లక్కీ ‍హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం దర్శకత్వం వహించనున్నాడు. అలాగే వరుసగా మహేశ్ తో సినిమాలు చేస్తున్న ప్రముఖ సీనియర్ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో ప్రముఖపాత్ర పోషిస్తున్నారు. అలాగే లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి దాదాపుగా 13ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయశాంతి పాత్ర చాలా కీలకమైందట..

ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్‌గా నటించనున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కానుండడతంతో అంచనాలు పెరిగిపోయాయి. ప్రేక్ష‌కుల‌కి వినోదం అందించ‌డం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. ముఖ్యంగా మహేశ్ బాబు శ్రీమంతుడు, మహర్షి ల ద్వారా సోషల్ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు చేస్తుండడం పట్ల ఈ సినిమా కూడా సమాజానికి ఉపయోగపడేలా ఉంటుందని సమాచారం. ఒకప్పుడు చిరంజీవి తెలుగు సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక సినిమాలు తీసేవారని ఇప్పుడు మహేశ్ ఆపని చేస్తున్నారని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat