తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ “ 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు స్వపరిపాలనలో బంగారు తెలంగాణ పునాది పడిన రోజు జూన్ 2. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. Greetings to all on #TelanganaFormationDay Let’s rededicate ourselves to the all-round development of Telangana “ అని ట్వీట్ చేశారు.
60 ఏళ్ళ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు స్వపరిపాలనలో బంగారు తెలంగాణ పునాది పడిన రోజు జూన్ 2. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
Greetings to all on #TelanganaFormationDay Let's rededicate ourselves to the all-round development of Telangana pic.twitter.com/T5c0ISjfxT
— KTR (@KTRTRS) June 1, 2019
తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS #TelanganaFormationDay pic.twitter.com/UREP6g6Pj3
— KTR News (@KTR_News) June 2, 2019