ఏపీ ముఖ్యమంత్రి, యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరి ప్రశంసలు పొందుతున్నారు. రాజకీయాలు, గెలుపోటములు పక్కన పెడితే హద్దులు లేని మానవత్వాన్ని ప్రదర్శించే వ్యక్తిగా ఈ యువ సిఎం చరిత్రలో నిలిచి పోతారు. తాజాగా జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని నరేంద్రమోడిని కలిసినపుడు సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కూడా వెంట తీసుకెళ్లారు. రాజకీయాల్లో, పాలనాపరమైన విధానాల్లో ఇది కచ్చితంగా గొప్ప విషయం.. సాధారణంగా ఎవరూ అటువంటి చాన్స్ అధికారులకివ్వరు.. కానీ జగన్ మాత్రం తనతో సిఎస్ ను ప్రధాని దగ్గరకు తీసుకెళ్లారు..
కేంద్రప్రభుత్వ కార్యదర్శి స్థాయి చీఫ్ సెక్రటరీలు ఇలా నేరుగా పీఎంలను కలవడం అరుదు. అసలు చంద్రబాబు 14ఏళ్ల పాలనలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అధికారులను తక్కువగానే చూసేవారు. అయితే జగన్ ప్రస్తుతానికి ఇంటి నుంచే పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటిలోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో సమీక్షలకు హాజరైన అధికారులకు తాను తినే ఆహారాన్నే అధికారులకు పెడుతున్నారు. అందరికీ ఇంటి భోజనం పెడతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఎప్పుడైనా భోజనం పెడితే హోటల్ నుంచి తెప్పించి పెట్టారు.