రెడ్మీ..ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో మారుమొగిపోతుందని చెప్పాలి.వాళ్ళ బ్రాండ్ వస్తుంటంటే చాలు కళ్ళు మూసి తెరిచేలోపల అన్ని సేల్ అయిపోతాయి.ఇటీవలే రెడ్మీ ఒక సరికొత్త ప్రీమియం మొబైల్ రిలీజ్ చేస్తానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం k20, k20 ప్రో పేరిట ఉన్న ఆ ఫోన్ లో చైనాలో హలచల్ చేస్తున్నాయి.ఈ ఫోన్లను ఇండియా మార్కెట్ కు తీసుకొస్తామని ఇటీవలే ఆ సంస్థ ప్రకటన కూడా చేసింది.ఈ మేరకు ట్విట్టర్ పోస్ట్ కూడా చేసారు.జూలై నెలలో ఈ మొబైల్స్ మనకి మనకి అందుబాటులోకి వస్తాయని ఆ కంపెనీ చీఫ్ మను కుమార్ జైన్ ప్రకటించారు.చైనా కన్నా ఇండియాకి వచ్చేసరికి రెట్లు తగ్గుతాయని అందరు భావిస్తున్నారు.ఇక ఫీచర్లు పరంగా చూసుకుంటే..
K20 ఫీచర్లు:
*6.39 అంగుళాల తెర
*స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్
*20మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
*48+8+13 ఎంపీ వెనుక కెమెరాలు
*4000 ఎంఏహెచ్ బ్యాటరీ
*ఆండ్రాయిడ్ పై ఓఎస్తో ఈ ఫోన్ రానుంది.
K20 ప్రో ఫీచర్లు:
*6.39 అంగుళాల తెర
*స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్
*20మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
*48+8+13 ఎంపీ వెనుక కెమెరాలు
*4000 ఎంఏహెచ్ బ్యాటరీ
*ఆండ్రాయిడ్ పై ఓఎస్తో ఈ ఫోన్ పనిచేయనుంది