టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంత చేసుకున్నాడు. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఆరు వికెట్లన్ తేడాతో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందు బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా బుమ్రా (2/35),చాహల్ (4/51)ధాటికి తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం రెండు వందల ఇరవై ఏడు పరుగులు మాత్రమే సాధించింది. 227పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్ శర్మ 144బంతుల్లో 13ఫోర్లతో ,2సిక్సర్లతో 122(నాటౌట్)రాణించడంతో 47.3ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి ఘనవిజయాన్ని సాధించిన సంగతి విదితమే. ఈ క్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్ గా కోహ్లీ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో అతి తక్కువ అంటే 69వన్డేల్లో 50విజయాలు సాధించిన టీమ్ ఇండియా సారధిగా రికార్డల్లోకెక్కాడు. అయితే ఇంతకుముందు డెబ్బై వన్డేల్లో యాబై విజయాలు సాధించిన విండీస్ మాజీ కెప్టెన్ రిచర్డ్స్ రికార్డును అధిగమించాడు కోహ్లీ. అయితే అతి తక్కువ వన్డే(63)ల్లో యాబై విజయాలు సాధించిన కెప్టెన్ గా ఆసీస్ మాజీ కెప్టెన్ రీకి పాంటింగ్ పేరిట మీద ఉంది..
Tags bcci Cricket icc richard ricky poiting slider southafrica sports team india wcc westindis world cup