Home / 18+ / ఆ నాలుగుశాఖలపై సీఎం దృష్టి.. మిగిలినవి మంత్రులకు ఇస్తానంటున్న జగన్

ఆ నాలుగుశాఖలపై సీఎం దృష్టి.. మిగిలినవి మంత్రులకు ఇస్తానంటున్న జగన్

నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమీక్షలు, ప్రక్షాళనలతో ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అన్ని శాఖలవారిగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్‌ ఇవాళ కీలకమైన వ్యవసాయ శాఖపై రివ్యూ చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ స్థితిగతులపై అధికారులతో జగన్ సమీక్షిస్తారు.. ఎన్నికల ప్రచారంలో రైతులకు ఎక్కువ హామీలిచ్చారు జగన్‌. పంట ధరలకు గిట్టుబాటు, 3వేలకోట్లతో ధరల స్థీరికరణనిధి ఏర్పాటు, రైతులకు ఉచితంగా బోర్లు, 12,500 చొప్పున నాలుగుదశల్లో రైతులకు పెట్టుబడి సాయంతో పాటు పలు హామీలిచ్చారు జగన్.. అయితే వీటి అమలు, విధి విధానాలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. వ్యవసాయ శాఖపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకుముందు అన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు పెట్టుబడిసాయం పథకం తీసుకొచ్చింది.

ఇందులో ఏటా ప్రతీ రైతుకు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో పాటు మరో 9వేల ఆర్థికసాయం అందించింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పథకాన్ని కొనసాగిస్తూనే పెట్టుబడి సాయాన్ని మరింత పెంచనుంది. అలాగే టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ అనే పథకం పేరును మారుస్తారా.? లేక వైఎస్సార్ పేరుతో మరోవిధంగా పధకాన్ని తెస్తారా అనేది వేచి చూడాలి. ముఖ్యంగా జగన్ మాత్రం అన్ని శాఖలు అందరికీ పంచి కేవలం నీటిపారుదల, విద్య, వైద్య, ఆరోగ్యశాఖలు తనవద్దే ఉంచుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రైతులకు అవసరమైన నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యానికి సంబంధించి వైద్యం, విద్యార్ధుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి తానే నిత్యం సమీక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు జగన్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat