Home / 18+ / జగన్ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతుంది అనేదానికి చిన్న ఉదాహరణ ఇది..విజయసాయి రెడ్డి

జగన్ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతుంది అనేదానికి చిన్న ఉదాహరణ ఇది..విజయసాయి రెడ్డి

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.గెలిచిన అనంతరం వైసీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానాని చెప్పారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానన్న మన యువ సీఎం 6రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు.ఈ మేరకు టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్త సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో విశ్రాంత జడ్జిలతో విచారణ చేయించడం చూశాం కానీ ఇప్పుడు నిరంతర స్క్రూటిని ఉంటుంది.

జగన్ గారి పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతోందో చిన్న ఉదాహరణ ఇది అని ఆయన అన్నారు.అంతేకాకుండా ఐపీఎస్ ను తాకట్టు పెట్టిన కొందరు అధికారులు పోలీసు శాఖను టీడీపీ అనుబంధ విభాగంగా మార్చారు. ప్రజలకు జవాబుదారిగా ఉండే అత్యుమ వ్యవస్థను సృష్టించే పనిలో జగన్ గారు మొదటి అడుగు వేశారు. అధికార పార్టీ వారిని ఒకలా, సాధారణ ప్రజలను మరోలా చూసే రోజుల పోయాయని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat