Home / ANDHRAPRADESH / ఏపీ ప్రజలను “ఘోరంగా అవమానించిన” పవన్..!

ఏపీ ప్రజలను “ఘోరంగా అవమానించిన” పవన్..!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయాడు.అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో ఘోరపరాజయం పాలయ్యాడు పవన్.సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష సమావేశం నిర్వహించారు పవన్. ఈ సమీక్ష సమావేశంలో పవన్ మాట్లాడుతూ” ఎన్నికల్లో నన్ను ఓడించాడానికి నూట యాబై కోట్లను ఖర్చు చేశారు.

ఓటుకు రెండు వేల నుండి ఐదు వేల వరకు పంచారు. భీమవరం,గాజువాక ఓటర్లు,ప్రజలు ఓటుకు నోటు తీసుకుని నన్ను మోసం చేశారు. నాకు ఓట్లేయకుండా ఓడించారని”తన ఆవేదనను వ్యక్తం చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా గుడి దగ్గర బిక్షాటన చేసేవాళ్లకే రోజుకు రెండు వేలకు మించి వస్తాయి. కానీ గాజువాక ,భీమవరం ప్రజలు తీసుకున్న రెండు వేలు రోజుకు రూపాయి చొప్పున వస్తాయి. దీనికంటే భిక్షాటన చేస్కోవడం మంచిది కదా అని ఓటర్లను ఉద్ధేశించి ఈ సమీక్ష సమావేశంలో పవన్ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించినట్లు సమాచారం.

అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు,మేధావులు,ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. జనసేన పార్టీ పెట్టి గతంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాడు. ఈ ఎన్నికల్లో సరైన భేరం కుదరక ఒంటరిగా బరిలోకి దిగాడు. ఇప్పుడేమో ఓటర్లను,ప్రజలను రెండు వేలకు అమ్ముడుపోయారని అంటున్నారు. అసలు అమ్ముడుపోతే పవన్ కు డిపాజిట్లు కూడా రాకూడదు కదా మరెందుకు వచ్చింది అని మేధావులు,ప్రజలు తమ అగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఇక నెటిజన్లు అయితే “తననుఎవరు ఓడించలేరు. ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసిన నన్ను అసెంబ్లీలోకి అడుగెట్టకుండా ఆపలేరు”అని పవన్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తోన్నారు. మరికొంతమంది అయితే ఏకంగా పవన్ ఏపీ ప్రజలను,ఓటర్లను గుడి ముందు బిక్షాటన చేస్కొమని అంటూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అవమానిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat