తీవ్ర అనారోగ్యానికి గురైన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత,ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెగ్యులర్ వైద్య సేవల కోసం లండన్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం అక్బరుద్దీన్ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురికావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు.
Praying for the speedy recovery and good health of Akbaruddin Owaisiji.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 11, 2019