Home / ANDHRAPRADESH / బాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న “కేశినేని”..!

బాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న “కేశినేని”..!

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఇంటిపోరు తప్పేలా ఇప్పట్లో లేదు. ఒకపక్క ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయంతో తీవ్ర ఆందోళనలో ఉన్న బాబుకు ఎన్నికల ఫలితాల తర్వాత నుండి విజయవాడం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని పెద్ద తలనొప్పిగా మారారు. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంట్ పదవుల్లో తనకు అన్యాయం అవమానం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు కేశినేని.. దాంతో ఆయన బీజేపీలో చేరనున్నారు.. అందుకే బీజేపీ పెద్దలతో టచ్ లో కూడా ఉన్నారని ఇటీవల కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

తనపై వస్తోన్న వార్తలపై కేశినేని స్పందించకపోవడంతో తనపై వస్తోన్న పార్టీ మార్పు వార్తలు నిజమే అని అందరూ భావిస్తోన్నారు. ఈ తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో కేశినేని పెట్టిన పోస్టు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తుంది. తన అధికారక సోషల్ మీడియా ఖాతాలో కేశినేని”నేను స్వయం శక్తిని నమ్మి పైకోచ్చినవాడ్ని..తన ఎదుగుదల్లో ఎవరి సాయం లేదు. నాకు ఆత్మగౌరవం ఉంది”.

ఎవర్ని నమ్మో నేను రాజకీయాల్లో లేను.. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకు అన్యాయం జరిగితే ఎవర్ని అయిన ఎదిరిస్తాను.. అఖరికీ పార్లమెంట్ సాక్షిగా ప్రధానినే ఎదిరించా.. మిగతావాళ్లంతా నాకో లెక్క.. నేను ఎవరికి భయపడను” అని ఆయన పోస్టు పెట్టారు. కేశినేని పెట్టిన పోస్టు గురించి నెటిజన్లు,విశ్లేషకులు నాని త్వరలోనే పార్టీ మారడం ఖాయం.. బాబు చేస్తోన్న కుట్రలు.. చేసిన అవినీతిపై సమరశంఖం పూరించాడని .. ఇక బాబుకు ముందు ఉంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానిస్తున్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat