Home / 18+ / ఆ విషయంలో చిరంజీవిని ప్రశ్నించావు కానీ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు.?

ఆ విషయంలో చిరంజీవిని ప్రశ్నించావు కానీ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు.?

మేధావుల సంఘం మాజీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కు, ప్రస్తుత మేధావుల సంఘం అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి ఓపెన్ సవాల్ విసిరారు.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము చలసానికి ఉందా.? అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రా మేధావుల సంఘానికి చలసాని అధ్యక్షుడు కాదని తేలడంతో ఆయన తెలుగుభాషా చైతన్య సంఘం అనే మరో వేదికను ప్రారంభించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో రవీంద్రరెడ్డి సంధించిన ప్రశ్నలు యధాతధంగా..

1. అసలు నీకు ఆంధ్రప్రదేశ్ లో ఓటుహక్కు ఉందా.?ఉంటే ఒకసారి చూపించండి.. ఏపీలో కనీసం ఓటుహక్కు కూడా లేని నీకు ప్రజలపట్ల నిజాయితీ ఉంటుందా.? ఓటుహక్కు వినియోగించుకోని నీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురుంచి మాట్లాడే హక్కుందా.? కనీసం సొంత రాష్ట్రంలో ఓటుహక్కు లేనినువ్వు మేధావివా.? ఇంత వయసొచ్చినా కనీసం ఆంధ్రా లో ఓటు నమోదు చేసుకోని నువ్వు నాదృష్టిలో ఒక బాధ్యత లేని వ్యక్తితో సమానం. విక్రమార్కునిలా ఓటెయ్యాలని చెప్పిన నువ్వు కనీసం ఓటు తెచ్చుకోపోటంతో నీ బుద్ది ఏంటో తెలుస్తుంది. చెప్పేందుకే నీతులు తప్ప పాటించేందుకు కాదని సిగ్గులేకుండా బతికే నువ్వు మేధావివా.?

2. ఆంధ్రా తెలంగాణలను విడగొడుతూ పార్లమెంట్లో బిల్లు పెడుతున్నప్పుడు తెలంగాణ మేధావులయిన కోదండరాం లాంటి వారితో నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావో ఆంధ్రా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది..

3. తెలంగాణ ను విడదీసినప్పుడు రాష్ట్రంలో పెద్ద పండుగ శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో జరుపుకునే తెలుగువారు ఇప్పుడు సెపరేట్ గా ఎక్కడ జరుపుకోవాలి మాకు సమానహక్కులు కావాలని రాష్ట్రాభివృద్ది చెందేవరకూ అని ఒకమాట కూడా మాట్లాడని నువ్వు ఆంధ్రప్రదేశ్ కు ఏ విధంగా ఉపయోగపడతావు

4. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు అక్కడేఉంటూ శాశ్వత భవనాలు నిర్మించి ఆంధ్రాకు ఖర్చులు తగ్గించకుండా ఉన్న పళంగా అమరావతికి షిఫ్ట్ చేసి అంద్రా ఉద్యోగులను అనవసర తాత్కాలిక భవనాలు నిర్మిస్తూ రాష్ట్ర లోటు బడ్జెట్ లో ఉన్నా ఖజానాకు బొక్క పెడుతుంటే మీరు అమరావతి సూపర్ అంటూ పొగిడి ఆంధ్రాకు ద్రోహం చేసినవారు మేధావులెలా అవుతారు.?

 5. ఉద్దండరాయునిపాలెం పవన్ కళ్యాణ్ వెళ్లి ల్యాండ్ పూలింగ్ కు తాను వ్యతిరేకం అనగానే ఎక్కడ ఎవరికి క్రెడిట్ పోతుందని నువ్వు బయటకువచ్చి నేనూ వ్యతిరేకం అనగానే అప్పటి ప్రభుత్వం మిమ్మల్ని సింగపూర్ పంపి రాజధాని డ్రాయింగ్ లు చూసి రమ్మనగానే వెళ్లి ప్రభుత్వానికి మద్దతిచ్చారు. ఆ డ్రాయింగ్ లు ఇపుడు ఏమయ్యాయి.?

6. పుష్కర సమయంలో 29మంది చంద్రబాబు ప్రచారంకోసం, ఆర్భాటంకోసం చనిపోతే నువ్వు మాట్లాడకుండా నీ కుల సీఎంకి తోడుగా నిలబడి అక్కడికి వచ్చిన భక్తులదే తప్పన్నావ్.. అలా మాట్లాడిన మీరు ఏ విధంగా అర్హులు అనేది ఆంధ్రా చెప్పాలి.?

7. హోదావద్దు ప్యాకేజి కావాలంటే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయలేదు. మాలాంటివారు గళం వినిపించి రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపితే మమ్మల్ని అక్రమకేసులు పెట్టింది ప్రభుత్వం.. మీలాంటివారు మాత్రం ఏసీ గదుల్లో సేదతీరి బయటకు వచ్చి మోడీ మోసం చేశాడని, చంద్రబాబు పోరాడాడని చంద్రబాబు తప్పు లేదుని మాట్లాడి సైలెంటయ్యారు. మరి మీరు ఏవిధంగా అంధ్రాకు మేధావులు అయ్యారనేది ప్రజలకు చెప్పాలి.

8.ప్రజ్లలో హోదా ఉద్యమం పైకి లేవగానే ఎక్కడ చంద్రబాబుకుచెడ్డ పేరు వస్తుందోనని U టర్న్ తీసుకోగానే అమరావతి వెళ్లి సమర్తించావు.. కానీ చంద్రబాబు నువ్వు తప్పు చేసావని నిలదీసిన పాపాన పోలేదు. ఇందుకు మీరు ఆంధ్ర ప్రజలకు కచ్చితంగా క్షమాపణ చెప్పాలి.

9. చంద్రబాబు,మీరు,శివాజీ,రవిప్రకాష్ కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ  మీకు టీడీపీ ఎమ్మెల్సీ ఇస్తామనగానే చంద్రబాబును పొగుడుతూ మోడిని తిడుతూ టీడీపీ కులపార్టీకి మద్దతిస్తూ ధర్మ దీక్షల్లో ఎందుకు పాల్గొన్నావ్.. అలాంటి నీవు ఆంధ్రా మేధావి అంటే సిగ్గవుతుంది.

10. పార్లమెంట్లో ఆంధ్ర,తెలంగాణ ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు చెప్పి హిందీ లో చేసిన వారిని విమర్శించావు.. తెలుగుభాష పరిరక్షణ సమితి అధ్యక్షుడు అని కొత్త పదవి పెట్టుకున్నావు.. అలాంటప్పుడు మాజీమంత్రి లోకేష్ తెలుగును ఎన్ని సార్లు కూని చేశాడో తెలియదా.. అప్పుడు భాషకోసం ఎప్పుడూ లోకేశ్ ని ఎందుకు విమర్శించలేదు.. నీకులపోడు అని సైలెంట్ గా ఉన్నావా.?

 11. తెల్ల జుట్టు, కండువా ఉన్నవాళ్లంతా మేధావి అని చెప్పుకుంటే తెలంగాణలో కూడా బంగి అనంతయ్య అని ఒక నాయకుడు ఏ కార్యక్రమం జరిగినా వేషాలు వేసుకుని వెళ్తారు.. నువ్వు ఆకోవకు చెందిన వాడివేనా.?

12.చంద్రబాబు ప్రభుత్వంలో నీ కులపోల్లకు కీలుబొమ్మలా ఉంటూ ఆంధ్రాను సర్వనాశనం చేసిన వారిలో నువ్వూ ఒకడివి.. అలాంటప్పుడు నువ్వెలా చెప్పుకుంటావు మేం పోరాటాలు చేశామని.?

13. తెలుగుభాషా సంఘం ఉపాధ్యక్షుడిగా చెప్పుకునే నువ్వు నారాయణ, చైతన్యవంటి పాఠశాలల్లో జరిపే నిర్భంద ఆంగ్ల భాషా తరగతుల్ని ఎందుకు అడ్డుకోలేదు?? హెరిటేజ్, సుజనా, మూళీమోహన్, సీఎం రమేష్ ల కంపెనీలు ఇంకా హైదరాబాద్ లొనే ఉంచి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టలేదు, వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు??

నీ పోరాటాల వల్ల నీ కులం బాగుపడి, నీ బ్యాంక్ బ్యాలన్స్ పెరిగిందే తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.. హోదా విషయంలో,  దుబారా ఖర్చుల విషయంలో, పట్టిసీమ అవినీతి ప్రోజెక్ట్స్ లో తప్పు చేసింది చంద్రబాబు అయితే, ఈ విషయాల్లో కూడా చంద్రబాబు ని పొగిడి కేంద్రాన్ని నిందించటం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏంటో చెప్పు.? ప్రత్యేకహోదాకి చిరంజీవి మద్దతు తెలపలేదని మాట్లాడిన నువ్వు, హోదా వద్దు ప్యాకేజి ముద్దు అని మాట్లాడిన చంద్రబాబుని ఎందుకు విమర్శించలేదు.?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat