తిరుమల తిరుపతి దేవస్థానం… ప్రపంచంలోనే అతిగొప్ప ఆథ్యా త్మిక క్షేత్రం. సప్తగిరులపై సర్వాంగ సుందరంగా కొలువుదీరిన శ్రీనివాసుడు… కోనలు, లోయలు, పచ్చని చెట్లతో అటు ఆథ్యాత్మికత, ఇటు ఆహ్లాదకర వాతావరణం… ఇలాంటి క్షేత్రంలో జీవితంలో ఒకసారైనా ఆ దేవదేవుని దర్శనం దొరికితే చాలనుకునేవాళ్ళు కొందరు.. ఏడాదికొకసారైనా ఆ దివ్య మంగళ స్వరూపుడిని దర్శించుకోవాలని తపనపడేవాళ్ళు మరికొందరు… అసలు ఆ దివ్యధామంలో ఉద్యోగం కోసం వెంపర్లాడే వాళ్ళు ఇంకొందరు… ప్రతి నిముషం శ్రీనివాస నామస్మరణం… వేద మంత్రాల పారాయణం… కలియుగ వైకుంఠం అని వూరికే అంటారా…!
అలాంటి కలియుగ వైకుంఠానికి ఛైర్మెన్గా పనిచేసే అవకాశం రావడమంటే అంతకన్నా అదృష్టం వుంటుందా? ఆ వేంకటేశ్వర స్వామి కరుణాకటాక్షం వుంటేగాని అలాంటి అదృష్టాన్ని పొంద లేరు. తాను చేసిన పూజలు, హోమాలు ఫలితమో, లేదా తన సతీమణి స్వర్ణమ్మ దైవభక్తి ఫలమో ఏమోగాని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు యఱ్ఱం వెంకటసుబ్బారెడ్డి(వై.వి.సుబ్బారెడ్డి) గారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి
సందర్భంగా మా దరువు. కామ్ నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం