Home / ANDHRAPRADESH / స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు

స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు

దరువు మీడియా సంస్థల అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి మరోసారి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.. తాజా పరిణామాలపై స్వామివారితో కరణ్ రెడ్డి మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కోరారు. స్వామివారు కరణ్ రెడ్డికి శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. అలాగే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తనకు ఎంతో నచ్చిన మనుషులకు, ఆ మనిషిపై ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తులనే దగ్గరకు హత్తుకుంటారు. ఇంకా ప్రేమ నమ్మకం ఉన్నవారిని స్వామివారు తన ముఖానికి హత్తుకుని, ముఖస్పర్శతో ప్రేమగా ఆశీర్వచనం అందిస్తారు. ఇలా స్వామివారి ఆశీర్వచనం అందుకోవడం తమ పూర్వజన్మల సుకృతంగా భావిస్తుంటారు.. తాజాగా కరణ్ రెడ్డిని స్వామివారు అదేవిధంగా ఆశీర్వదించి ప్రత్యేకంగా అభినందించారు. ఆధ్యాత్మికంగా కరణ్ రెడ్డి మొదటినుంచీ స్వరూపానంద స్వామి కి అనుచరుడిగా ఉంటున్నారు. గతంలోనూ ఎన్నోసార్లు కరణ్ రెడ్డి స్వామివారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఇటీవల విజయవాడ కృష్ణానది తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కరణ్ రెడ్డి స్వామివారిని కలిసారు.

See Also : వైఎస్ వివేకానందరెడ్డిని చంపిందెవరు?… పులివెందుల, జమ్మలమడుగు టీడీపీ నేతల్లో టెన్షన్…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat