విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సక్రమంగా జరగలేదని ఆరోపిస్తూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . జరిగిన ఎన్నికల్లో బోండా ఉమపై మల్లాది విష్ణు గెలిచారు. అయితే ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ పిటిషన్ వేశారు. తాజాగ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.