నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి 2014సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అత్యధిక స్థానాలను గెలుపొంది ప్రతిపక్ష నేతగా తొలిసారిగా నవ్యాంధ్ర అసెంబ్లీలో అడుగు పెట్టిన సంగతి విదితమే. ఆ తర్వాత అప్పటి నుండి వైసీపీ అధినేతగా,ప్రతిపక్ష నేతగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ.. బాబు అండ్ బ్యాచ్ ను తన స్పీచులతో చుక్కలు చూపించిన సంగతి మనకు తెల్సిందే.ఈ క్రమంలో అప్పటి ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో తొలి స్పీచ్ వెనక దగ్గర నుండి తన వెనక ఎవరున్నారో వివరించారు ముఖ్యమంత్రి జగన్.
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో ఆర్థిక సలహాదారుగా పనిచేసిన డీఏ సోమయాజులు 67వ జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా దివెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం జగన్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ” డీఏ సోమయాజులు భౌతికంగా లేకపోవడం తీరని లోటు” అని అన్నారు.సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ”ఆయన ఒక ఎన్సైక్లోపీడియా (విజ్ఞాన సర్వస్వం) అని అభివర్ణించారు. అప్పట్లో వైసీపీని స్థాపించిన తొలి రోజుల్లో.. పార్టీని ఎలా నడుపుతారో అనే మీమాంస చాలా మందిలో ఉండేది.
ఆ సమయంలో మొట్టమొదటగా తనతో అడుగులు వేసిన వ్యక్తి సోమయాజులు అని ఆయన తెలిపారు.అప్పటి నుండి ప్రతి సందర్భంలోనూ ఆయన తనకు ఒక గురువులాగా ఉండేవారన్నారు. ప్రతి విషయంలోనూ తనకు సూచనలు, సలహాలు ఇచ్చి నడిపించారని చెప్పారు. ప్రతిపక్ష నేతగా 2014లో మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగు పెట్టినపుడు, ఆ తరువాత ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ తన ప్రసంగాల వెనుక సోమయాజులు ఉండి నడిపించారని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు.