వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. చిన్న హీరో సరసన నటించిన మూవీతో ఎంట్రీచ్చిన బక్కపలుచు అమ్మడు ,అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క రోజు రాత్రి నిద్రలేకుండా గడిపింది.అసలు విషయానికి వస్తే దేశంలోనే ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై వరస వర్షాలతో..వరదలతో అతలాకుతలం అవుతున్న సంగతి విదితమే.
దీంతో ముంబై పరిధిలోని పలు రైళ్ల,విమానాల రాకపోకలతో పాటు రోడ్డు రవాణా వ్యవస్థ అంతా స్థంభించిపోయింది. ఈ క్రమంలోనే గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై ఎయిర్ పోర్టు లో రాకపోకలకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ముంబై ఎయిర్పోర్ట్లో రాకపోకలు సాగుతున్నాయా అని ప్రశ్నిస్తూ ముంబై సిటీ మున్సిపాలిటీ,పోలీస్, ఎయిర్పోర్ట్ వర్గాలకు ట్యాగ్ చేస్తూ అమ్మడు ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ”గత రాత్రి అంతా ఒక్క ప్లైట్ కూడా కదల్లేదు. నేను ఎయిర్పోట్లో ఇరుక్కుపోయాను”అంటూ ట్వీట్ చేసింది అమ్మడు. అంతేకాకుండా నాకు రాత్రి అంతా నిద్ర కరువైందని అమ్మడు చమత్కరించింది.