టాలీవుడ్ యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడనే సంగతి తెల్సిందే . ఈ క్రమంలో తన గురించి వచ్చిన ప్రతీ ట్వీట్ను రీ ట్వీట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఒక్కోసారి ఎస్ ఎస్ తమన్ చేస్తోన్న చర్యలు బెడిసి కొడుతుంటాయి.
గతంతో దేవీ శ్రీ ప్రసాద్ను దూషిస్తూ పెట్టిన ఒక ట్వీట్ను తమన్ లైక్ చేయడం వివాదాస్పదమైంది.తాజాగా మరోసారి తప్పులో కాలేశాడు తమన్. నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కిన మజిలీ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తమన్ తన సోషల్ మీడియా పేజ్లో చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఫేస్బుక్లో లీడ్ పెయిర్ అంటూ సమంత, అక్కినేని నాగార్జునల పేర్లు రాయటంపై సెటైర్లు పడుతున్నాయి.