తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా చార్మినార్ నుండి మహబూబ్ నగర్ లోని మయూరి ఎకో పార్కు వరకు సుమారు 300 మోటారు వాహనాల తో బైక్ రైడ్ ను చార్మినార్ వద్ద ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంతవర్యులు శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రాలకు పెట్టని కోట అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు వాటికి తగినంత ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించేందుకు, ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అవగాహన కల్పించడంతో పాటు రోడ్డు భద్రతా చర్యల స్పూర్తిని కలిగిస్తూ ఈ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. ఈ బైక్ ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి ఐకాన్ గా ఉన్న చార్మినార్ నుండి మహబూబ్ నగర్ లోని మయూరి ఎకో పార్క్ వరకు జరుగుతున్న ఈ ర్యాలీ లో సుమారు 300 మంది బైక్ రైడర్ లు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Tags kcr ktr slider srinivas gowd telangana governament telanganacm telanganacmo trs tscm tscmo