పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చాలా కాలం తరువాత టాలీవుడ్ లో పక్కా మాస్ మసాలా కమర్షియల్ గా వచ్చిన చిత్రం ఇది.అయితే ఏది ప్రస్తుతం సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 36 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి సేఫ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది.ఈ రోజు ఆదివారం కావడంతో ఫాన్స్ మరింత జోష్ మీద ఉంటారు. దీంతో ఈ చిత్రం ఈరోజే 50కోట్ల మార్క్ ను క్రాస్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు చిత్ర యూనిట్. ఈమేరకు అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు.