టీమిండియా ప్రధాన కోచ్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఇంక కొనసాగడం కష్టమేనని, కాని జట్టుకు ఆయనే కోచ్ గా కొనసాగితే కోహ్లి సేన విజయాలు సాధిస్తుందని కొత్త కోచ్ వస్తే టీమ్ డీలా పడుతుందని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రవిశాస్త్రి-కోహ్లి కాంబినేషన్ లో భారత్ జట్టు ఎన్నో విజయాలు సాధించిందని, ఇలాంటి సమయంలో కొత్తవారు వస్తే కష్టమేనని చెప్పుకొచ్చారు. ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి పదవీకాలం పూర్తికాగా.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉండడంతో అప్పటివరకు కొనసాగితే జట్టుకి చాలా మంచిదని అన్నారు.