విజయవాడ నగర ప్రజలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానుల కోరిక మేరకు రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని పోలీసు కంట్రోల్ రూం ప్రాంతంలో పునఃప్రతిష్ఠ చేయాలని మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారయణ, ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, జోగి రమేష్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వేంకటేష్ తదితరులు బందరు రోడ్డు లోని పోలీసు కంట్రోల్ రూం ప్రాంతం, తదితర ప్రాంతాలను పరిశీలించారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు కృష్ణా పుష్కరాల సమయంలో ట్రాఫిక్కు అడ్డంకిగా ఉందని అబద్ధపు కారణంతో ఏమాత్రం ట్రాఫిక్ కు ఇబ్బందిలేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం తొలగించిన విషయం తెలిసిందే.. అయితే పార్టీలకతీతంగా చాలామంది ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
పోలీసు కంట్రోల్ రూం సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించి, కంట్రోల్ రూం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద భద్రపర్చారని, దాన్ని తిరిగి తొలగించిన ప్రాంతంలోనే పునఃప్రతిష్ఠ చేయాలని అప్పట్లోనే ప్రజలు, అభిమానుల ఆందోళనలు చేపట్టారు. అలాగే వైఎస్ అభిమానులు మాత్రం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తాజాగా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో భేటీఅయిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం వైఎస్ విగ్రహాన్ని పున:ప్రతిష్టించేందుకు ప్రయత్నిస్తోంది.