నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది. గతంలో దరువు నిర్వహించిన సర్వేలు వందకు వంద శాతం నిజమయ్యాయి. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు గెల్చుకుంటుందని ప్రకటించిన దరువు సర్వే నిజమైంది. 2018 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 90 సీట్లు గెల్చుకుంటుందని దరువు సర్వే ఫలితాలను ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ 90 సీట్లు గెల్చుకుని చరిత్ర తిరగరాసింది. ఇక 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వస్తాయని చెప్పిన ఏకైక సర్వే…దరువు. 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పింది దరువు.
సర్వేల్లో ప్రజలనాడీ పట్టుకోవడంలో దరువుది అందె వేసిన చేయి. ప్రామాణికత, కచ్చితత్వం, పారదర్శకత పాటించడం దరువుకే సొంతం. అయితూ వైయస్ జగన్ 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు సమగ్ర సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడం జరిగింది. మహిళలు, వృద్ధులు, యువత, ఉద్యోగులు, రైతులు..ఇలా అందరినీ దరువు పలకరించింది. పట్టణాలు, అర్బన్ ప్రాంతాలతోపాటు రూరల్ గ్రామాల్లోనూ దరువు సర్వే నిర్వహించింది. మొత్తం 50వేలమందిని ఈ సర్వేలో భాగస్వాములను చేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో జగన్ దుబారా ఖర్చులను తగ్గించగలిగాడా అనే అంశంపై ప్రజల అభిప్రాయం తీసుకోవడం జరిగింది.
ఈ అంశంలో దాదాపు 90 శాతంమంది దుబారా చేయడం లేదని చెప్పగా.. 7 శాతం మాత్రం దుబారా చేస్తున్నాడని, 3 శాతం ఓకే ఫర్వాలేదని చెప్పారు. సీఎం జగన్ పాలన చేపట్టిన రోజు నుండి ఈరోజు వరకు కూడా ప్రజలకు పాదదర్శక పాలన అందిస్తామని చెప్పడమే కాకుండా, తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఎవరూ దుబారా ఖర్చులు చేయొద్దని, పబ్లిసిటీకి డబ్బులు వినియోగిస్తే ఉపేక్షించేది లేదని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఖర్చుతో చేసే ఏ కార్యక్రమంలోనూ కచ్చితంగా ఖరీదైన హిమాలయా వాటర్ ను కూడా నిషేధించారు. అలాగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా హంగు ఆర్భాటాలు లేకుండా విజయవాడలోని ఓ స్టేడియంలో అతితక్కువ ఖర్చతో చేపట్టారు. అలాగే తాను కూడా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ ఆదర్శంగా నిలిచారు. గత ప్రభుత్వంలా పబ్లిసిటీ కోసం ఫ్లెక్సీలు, యాడ్స్ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎటువంటి ఈవెంట్లు, ఫంక్షన్లు డబ్బులు ఖర్చుచేసి చేయొద్దని కోరుతున్నారు.