Home / NATIONAL / సుష్మా స్వరాజ్ మరణంపై సోనియాగాంధీ స్పందన…!

సుష్మా స్వరాజ్ మరణంపై సోనియాగాంధీ స్పందన…!

మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మిక మరణం దేశ ప్రజలందరిని శోకసంద్రంలో ముంచివేసింది. ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకురాలిగా భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సుష్మాస్వరాజ్ మరణం పార్టీకలతీతంగా ప్రతి ఒక్కరిని కలిసివేసింది. కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన, జేడీయూ, టీఆర్ఎస్, వైసీపీ ఇలా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీల సుష్మా మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా సుష్మా మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా యుపీఏ అధ్యక్షురాలు ఎంపీ సోనియా గాంధీ కూడా సుష్మా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. సుష్మా భర్త కౌశల్ కు సోనియాగాంధీ ఓ లేఖ రాశారు…” మీ భార్య మరణం తనను తీవ్ర ఉద్వేగానికి గురిచేసిందని సోనియా ఆ లేఖలో చెప్పారు. ధైర్యం – అంకితభావం కలిగిన నేత సుష్మా అని అన్నారు. సుష్మా తన దౌత్యపరమైన విధానంతో బాధలో ఉన్న ప్రతి ఒక్కరికీ చేరువయ్యారన్నారు. గొప్ప పార్లమెంటేరియన్ అని – ఆమె స్నేహభావం అందర్నీ కట్టిపడేసిందన్నారు. లోక్ సభలో తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని – సుష్మా మరణం తనకు వ్యక్తిగతమైన నష్టమే అని సోనియా ఆ లేఖలో పాల్గొన్నారు. పార్టీలకతీతంగా అందరి మనసులను చూరగొన్న ఏకైక నేత…సుష్మాస్వరాజ్ అని సోనియాగాంధీ లేఖ మరోసారి తెలియజేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat