Home / ANDHRAPRADESH / కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు…?

కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు…?

ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలన 50 రోజులు పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది. గతంలో దరువు నిర్వహించిన సర్వేలు వందకు వంద శాతం  నిజమయ్యాయి. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు గెల్చుకుంటుందని ప్రకటించిన దరువు సర్వే నిజమైంది. 2018 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 90 సీట్లు గెల్చుకుంటుందని దరువు సర్వే ఫలితాలను ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ 90 సీట్లు గెల్చుకుని చరిత్ర తిరగరాసింది.  ఇక 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వస్తాయని చెప్పిన ఏకైక సర్వే…దరువు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీకి 300 సీట్లు వస్తాయని చెప్పింది దరువు. సర్వేల్లో ప్రజలనాడీ పట్టుకోవడంలో దరువుది అందె వేసిన చేయి. ప్రామాణికత, కచ్చితత్వం, పారదర్శకత పాటించడం దరువుకే సొంతం.
వైయజగన్ పాలన 50 రోజులు పూర్తైన సందర్భంగా దరువు మీడియా సమగ్ర సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడం జరిగింది.  మహిళలు, వృద్ధులు, యువత, ఉద్యోగులు, రైతులు..ఇలా అందరినీ దరువు పలకరించింది. పట్టణాలు, అర్బన్ ప్రాంతాలతోపాటు రూరల్ గ్రామాల్లోనూ దరువు సర్వే నిర్వహించింది. మొత్తం 50వేలమందిని ఈ సర్వేలో భాగస్వాములను చేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు. కేసీఆర్, జగన్‌ల స్నేహం..ఇరు రాష్ట్రాలకు మంచిదేనా అనే అంశంపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఈ అంశంలో కేసీఆర్‌, జగన్‌ల స్నేహంపై 70% మంది సంతోషం వ్యక్తం చేయగా,   23% మంది హ్యాపీగా లేమని చెప్పారు. ఇక  7% మంది ఈ విషయంపై ఏమి చెప్పలేదుగత ముఖ్యమంత్రి ఐదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించారని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా కేసుల్లో ఇరుక్కుని పదేళ్ల పాటు రాజధానిగా హక్కు ఉన్న హైదరాబాద్‌ను వదులుకుని అమరావతికి రావడం వల్ల అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారని కొంత మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత సమస్యను ఇరుగు రాష్ట్రాల సమస్యగా క్రియేట్ చేసి, గత ముఖ్యమంత్రి ఐదేళ్లపాటు ప్రతి క్షణం తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించారని మెజారిటీ ప్రజలు చెప్పారు. తెలంగాణ ఎగువన ఉన్న రాష్ట్రం అని, ఆ రాష్ట్రంతో నిత్యం గొడవలు పడితే…దిగువన ఉన్న మన రాష్ట్రమే నష్టపోతుందని, అందుకే తెలంగాణ సీఎంతో జగన్ సఖ్యతగా ఉండడం సబబే అని..మరి కొందరు అభిప్రాయపడ్డారు. గోదావరి జలాలు శ్రీశైలం తరలించేందుకు తెలంగాణ సీఎం సానుకూలంగా ఉన్నారు..భవిష్యత్తులో గోదావరి జలాలే…మనకు దిక్కని..కాబట్టి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ సఖ్యతగా ఉంటేనే మేలు అని మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి పక్క రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్ స్నేహంపై 90 శాతం మంది ప్రజలు సానుకూలంగా స్పందించడం గమనార్హం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat