Home / SLIDER / బీజేపీ గూటికి వివేక్

బీజేపీ గూటికి వివేక్

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌ బీజేపీలో చేరారు. ఈరోజు దేశ రాజధాని దిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో వివేక్‌ భేటీ అయ్యారు. తనతోపాటు మేధావులు, పలువురు నేతలు బీజేపీలోకి వస్తారని బీజేపీ అధిష్ఠానానికి వివేక్‌ తెలిపినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్న కమలదళం.. దళిత, గిరిజన సామాజిక వర్గాల్లో బలమైన నేతలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే గిరిజన సామాజికవర్గానికి చెందిన ఓ మాజీ ఎంపీతోనూ సంప్రదింపులు జరిపింది. ఇది కొలిక్కి రాలేదని సమాచారం. మరోవైపు టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయని కమలం నేత ఒకరు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat