కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు అని సమాచారం. ఈ క్రమంలో నాగ్పూర్ – ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
నాగ్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ కాకుండానే రన్వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్.. ఆ విమానాన్ని రన్వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు.
ఇక విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ దించేశారు. సాంకేతిక లోపాన్ని ముందే పసిగట్టడంతో పెనుప్రమాదం తప్పిందని ఎయిర్పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికులందరూ నాగ్పూర్ ఎయిర్పోర్టులోనే ఉన్నారు.