చంద్రబాబు రాజగురువుగా పిలువబడే ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా..ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారా…ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే రామోజీరావు ఆరోగ్యం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఈనాడు వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం రామోజీరావు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, సంస్థ కార్యకలాపాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. రామోజీ గ్రూప్ లో ఉన్న కంపెనీల వ్యవహారాలన్నింటినీ ఇప్పటికీ రామోజీరావే చూసుకుంటున్నారని వారు అంటున్నారు. పెద్దకొడుకు కిరణ్, కోడలు శైలజ వ్యాపార వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ..మొత్తంగా ఈనాడు గ్రూపుల పర్యవేక్షణ మాత్రం రామోజీరావుదే. అంతే కాదు కీలక వ్యవహారాల్లో నిర్ణయాధికారం కూడా అతనిదే. గ్రూపులో ఏకస్వామ్యం నడుస్తున్న ఈ సమయంలో రామోజీరావు ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పుకార్లు ఈనాడు గ్రూపులో ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
Tags health issue hyderbaad Ramoji rao