భారత్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో వెస్టీండీస్ ఢీలా పడింది.టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకి ఆలౌటైంది.ఈ సీజన్లో విండిస్ తో జరిగిన తొలి టెస్ట్లో సెంచరీ మిస్ చేసుకున్న హనుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో టెస్ట్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది.
అంతక ముందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ (76; 10 ఫోర్లు) అర్ధశతకంతో మెరిశాడు. ఇక చివరిలో ఎనిమిదో వికెట్కు ఇషాంత్ శర్మ (57) , హనుమతో కలిసి అజేయంగా 102 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ని బుమ్రా ఏ దశలోను కోలుకోనివ్వకుండా చేశాడు. వరుస వికెట్స్ తీస్తూ విండీస్ పతనాన్ని శాసించాడు. మొత్తంగా ఆరు వికెట్లు తీసిన బుమ్రా .. ఇందులో హ్యాట్రిక్ కూడా నమోదు చేసుకున్నాడు.
విండీస్ బ్యాట్స్మెన్స్లో క్రైగ్ బ్రాత్వైట్ (10), కెంప్బాల్ (2), డారెన్ బ్రావో (4), బ్రూక్స్ (0), రోస్టన్ఛేజ్ (0), జేసన్ హోల్డ్ (18) తక్కువ రన్స్కే వెనుదిరగగా.. సిమ్రాన్ హెట్మెయర్ (34) కాస్త పర్వాలేదనిపించాడు. ఆయన వికెట్ షమీకి దక్కింది . ప్రస్తుతం క్రీజులో హామిల్టన్ (2 నాటౌట్), రకీమ్ కార్న్వాల్ (4 నాటౌట్) ఉండగా.. భారత్ కంటే ఇంకా 329 పరుగులు తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ వెనకబడి ఉంది.