తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రతి విషయానికీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాలని చూస్తాయి. ప్రస్తుతం ఇదే పనిలో పడింది జనసేన పార్టీ. ఎక్కడైనా సందు దొరికితే చాలు అధికారపార్టీ ఐన వైసీపీ పై నిందలు వెయ్యడానికి చూస్తున్నారు. ఇప్పటివరకు వారి ప్రవర్తన ఎలా ఉందనేది పక్కన పెడితే ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు ఈరోజును గొడవలకు పునాదిగా మార్చేసారు అనడంలో సందేహం లేదు.బర్త్ డే సెలేబ్రషన్ పేరుతో కాలేజీ పరిసరాల్లో రచ్చ చేస్తున్నారు. ఈ మేరకు అరెస్ట్ వరకు కూడా వెళ్తున్నారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా శశి కాలేజీలో లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్న విషయం తెలిసిందే.అదే జిల్లాలో వేరే కాలేజీలో బర్త్ డే సెలేబ్రషన్ లో రాద్ధాంతం చేసిన విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో రాస్తారోకో, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా.. వగైరా, వగైరాతో మల్లా హడావడి మొదలుపెట్టారు. ఇలా రాష్ట్రం మొత్తం జనసైనికులు తమ బలం చాటుకోవడానికి పక్క వారిని ఇబ్బంది పెడుతున్నారు. తమ తల్లితండ్రులు పిల్లల భవిష్యత్తు ఏమయిపోతుందో అని భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపకుండా సైలెంట్ గానే ఉన్నాడు.